చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మున్నూరు కాపు సంఘం మండల కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఆదివారం స్థానిక సూర్య డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన మున్నూరుకాపు సంఘం విస్తృత స్థాయి సమావేశంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మున్నూరుకాపు సంఘం మండల అధ్యక్షుడిగా లంకా నరసింహారావు, ప్రధానకార్యదర్శిగా పసుపులేటి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు చలవాది రామారావు, కోశాధికారి యన్నం రాములు సహాయ కార్యదర్శి రంగిశెట్టి రామారావు,గౌరవఅధ్యక్షులు శెట్టిపల్లి కృష్ణయ్య, కమిటీ సభ్యులుగా ఆకుల రాంబాబు, చిట్టెంశెట్టి పెద్ద శీను, ఆళ్ళ శ్రీనివాస్, కృష్ణ,వెంకటేశ్వర్లు లక్ష్మీపతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు బండి కృష్ణ, పులి సత్యం, కృష్ణ, సుంకర రామారావు, భూపతి రమేష్, దయాకర్, మక్క రమేష్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: