CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వాతంత్రం తీసుకు వచ్చిన జాతిపిత గాంధీ: zptc పోశం నర్సింహరావు.

Share it:

 



మహాత్మా గాంధీ సత్యం మరియు అహింస విలువల ఆధారంగా భారతదేశాన్ని వలస పాలన నుండి విముక్తి చేసే పోరాటానికి నాయకత్వం వహించారని జడ్పిటిసి పోశం నరసింహారావు అన్నారు.  శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన సేవలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ... భారతీయులందరూ గాంధీజీ పోరాటాలు మరియు త్యాగాన్ని స్మరించుకోవాల్సిన ప్రత్యేకమైన రోజు ఇది . గాంధీజీ బోధనలు, ఆదర్శాలు మరియు విలువలకు కట్టుబడి ఉంటూ భారతదేశాన్ని గాంధీజీ కలలు గన్న దేశంగా మార్చడానికి మేము నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయ కుమారి, టిఆర్ఎస్ మండల గ్రామ పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు, పిఎసిఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ కేవీ రావు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: