కరకగూడెం :తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ హెల్పేర్స్ కు పెంచిన 30 శాతం prc అమలు చేసి వేతనాలు ఇవ్వాలి అని కోరుతూ రాష్ట్ర మొత్తం జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా మణుగూరు ప్రాజెక్టు లోని కరకగూడెం లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ను తహసీల్దార్ కు అందించారు...
ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యగులకు ఇచ్చిన విధంగా PRc 30 శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చి go ఇచ్చినా జులై నెల నుంచి నేటి వరకు ఇవ్వలేదు అని అన్నారు . దసరా పండుగ సందర్భంగా నూతన వేతనాలు వస్తాయి అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఆడ పడుచులకు నిరాశ పరిచిన కేసీఆర్ తక్షణమే పెరిగిన వేతనాలు అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమం చేస్తాం అని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వంగరి సతీష్ పోలేబోయిన రమాదేవి కే సావిత్రి p చంద్రకళ అనురాధ కస్తూరి భానుప్రియ సునీత పూర్ణిమ సుజాత అమరావతి శిరీష విజయకుమారి తదితరులు పాల్గొన్నారు
.
Post A Comment: