మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో గల బస్ స్టాండ్ సెంటర్ నందు నూతనంగా హాయ్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ షాప్ ను అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నూతన వ్యాపారానికి మండల ప్రజలందరూ సహకరించి వ్యాపార అభివృద్ధికి తోడ్పడగలరని అయన కోరారు. అనతరం సెల్ షాప్ యాజమాన్యం ఎంపీపీ ని శాలువాతో సత్కరించారు. నూతన ప్రారంభం కారణంగా ఆకర్షణీయమైన ఆఫర్స్, బహుమతులు ఇవ్వడం జరుగుతుంది, కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా వ్యాపార అభివృద్ధికి సహకరించ గలరని హాయ్ మొబైల్స్ & ఎలక్ట్రానిక్స్ వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు శెట్టిపల్లి. రఘురాం, సెల్ షాప్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: