CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వైయస్ షర్మిల పాదయాత్ర విజయం కాంక్షిస్తూ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ

Share it:

 


 గుండాల అక్టోబర్ 19 (మన్యం మనుగడ) వై ఎస్ ఆర్ టి పి పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్ర బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. వైయస్ షర్మిల పాదయాత్రను కాంక్షిస్తూ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి అనంతరం రాష్ట్ర నాయకురాలు సుధారాణి మాట్లాడుతూ 14 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్ర కొనసాగనుంది అన్నారు. ఈ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను వైయస్ షర్మిల వింటారని ఆమె పేర్కొన్నారు. రాజన్న రాజ్యం తేవడం కోసమే ఈ పాదయాత్ర చేపట్టారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల కన్వీనర్ టి రాంబాబు, ఆళ్లపల్లి మండల కె సుధాకర్ , మాడే మంగయ్య , రాంబాబు , భరత్, భరత్ రెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: