CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకో

Share it:


నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకో

;; బాధిత కుటుంబానికి 20 లక్షల   నష్ట పరిహారం అందించాలి

;; కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ముందు అఖిలపక్ష నాయకులు కుటుంబ సభ్యుల ధర్నా

 గుండాల అక్టోబర్ 28 (మన్యం మనుగడ) నిర్లక్ష్యంగా వ్యవహరించి తల్లి భాగ్యలక్ష్మి శిశువు మృతికి కారకులైన వైద్య సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ భాష , సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య , న్యూ డెమోక్రసీ నాయకులు గుండాల ఎంపీపీ  ముక్తి సత్యం పాల్గొని ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి 20 లక్షల  నష్టపరిహారం తోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి డిమాండ్ చేశారు. స్పందించిన అదనపు డీఎంహెచ్వో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యురాలు సరళ కుమారి సస్పెండ్ చేస్తాం హామీ ఇవ్వడంతో కాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు

Share it:

TELANGANA

Post A Comment: