క్రీడలతో మానసిక ఉల్లాసం
- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
-విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు.
పినపాక
పినపాక మండలం తో గూడెం పంచాయతీ గోపాల్ రావు పేట గ్రామంలో లో పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటుచేసిన క్రికెట్ పోటీలలో 12 టీములు పోటీ చేస్తున్నాయి. మొదటి రోజు జరిగిన మూడు మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ పినపాక ప్రెస్ క్లబ్, వార్డు మెంబర్ల కు జరగగా పినపాక ప్రెస్ క్లబ్ విజయం సాధించింది . రెండో మ్యాచ్ మణుగూరు ప్రెస్ క్లబ్ , భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ టీం పోటీలో భద్రాద్రి పవర్ ప్లాంట్ గెలుపొందింది. మధ్యాహ్నం జరిగిన మూడో మ్యాచ్ కరకగూడెం ప్రెస్ క్లబ్ టీచర్ల జట్టు మధ్య జరగగా టీచర్ల జట్టు విజయం సాధించింది. కార్యక్రమంలో పినపాక ప్రెస్ క్లబ్ సభ్యులు నాగేందర్, శంకర్, భారత్,బృహస్పతి, సుధాకర్, లక్ష్మణ్, నిట్ట వెంకట్,కోటి, విజయ్, దిలీప్,తదితర ప్రెస్ క్లబ్ మిత్రులు,గ్రామస్తులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
Post A Comment: