- రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.10వేల ఆర్థిక వితరణ అందజేత
- కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడం సంతృప్తినిస్తుంది:విప్ రేగా కాంతారావు
మన్యం టీవి, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన వల్లెపు కృష్ణ అనారోగ్యంతో బాధపడుతుండటంతో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 వేల రూపాయల చెక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడం సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ, టిఆర్ఎస్ పార్టీ మండలం అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, తో గూడెం ఎంపీటీసీ డాక్టర్ చింతపంటి సత్యం, పినపాక సర్పంచ్ గోగ్గేల నాగేశ్వరరావు,తో గూడెం ఉపసర్పంచ్ బుసి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కోలేటి భవాని శంకర్, బోలిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: