CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పిఆర్టియు రాష్ట్ర కార్యదర్శిగా చింత రామ్మోహన్రావు ఉపాధ్యాయులు

Share it:

 



 మన్యం టీవీ చర్ల:


పి ఆర్ టి యు 34వ రాష్ట్ర కౌన్సిల్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కు చెందిన సీనియర్ ఉపాధ్యాయులు చింత రామ్మోహన్ రావు రాష్ట్ర కార్యదర్శి పదవిని కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం రామ్ మోహన్ రావు ఉపాధ్యాయులు చర్ల మండలం జీ.పి పల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ సబ్జెక్టుగా మరియు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన చేసిన సేవలకు గాను 2019 సంవత్సరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ పి ఆర్ టి యూనియన్ లో నేను చేస్తున్నటువంటి సేవలను గుర్తించి నాకు ఈ రోజున రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని, నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యూనియన్ ఎదుగుదలకు అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలుపుతూ పిఆర్టియు చర్ల మండల కమిటీ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. చర్ల మండలం తరఫునుంచి రాష్ట్ర కమిటీకి ఎన్నిక కావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

Share it:

Post A Comment: