.
మన్యం మీడియా ప్రతినిధి/దమ్మపేట:: మండలంలోని అంకంపాలెం గ్రామ శివారు గ్రామమైన యర్రగుంపు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయం లో త్రయాహ్నిక దీక్షతో తేదీ అక్టోబర్ 28 నుండి 30 వరకు వైభవంగా ప్రతిష్ట చేయనున్న సీతారామ,లక్ష్మణ, ఆంజనేయ, గణపతి, బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు లను పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు గౌరవంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో దమ్మపేట మండల జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, టిఆర్ఎస్ పార్టీ దమ్మపేట మండల అధ్యక్షులు దొడ్డుకుల రాజేశ్వరరావు, గ్రామస్తులు తాటి చంద్ర రావు, తాటి రాము, రాజు, పొట్ట బాలకృష్ణ తదితరులు ఉన్నారు.
Post A Comment: