పినపాక నియోజకవర్గం లో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలని కొర్స. ఆనంద్ పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ డిమాండ్
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మోగించిన నిరుద్యోగ జంగ్ సైరన్ స్ఫూర్తి గా అన్న డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య ఆదేశాల మేరకు మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎండి రషీద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కొర్సఆనంద్ గారు మాట్లాడుతూ ఏజెన్సీ గిరిజన ప్రాంతమైన పినపాక నియోజకవర్గం రోజురోజుకీ ఇండస్ట్రియల్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ ప్రాంత స్థానిక యువతకు ఉపాధి అవకాశం లేకుండా స్థానికేతరుల ఉద్యోగుల అడ్డాగా మారిపోయింది. స్థానికంగా ఉన్న SCCL. BTPS. ITC లో ఉన్నటువంటి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిన కంపెనీలలో క్యాజువల్ లేబర్. ఎంప్లాయిస్ లలో కనీసం 60% వాటా స్థానిక యువత కు అవకాశం ఇవ్వకుండా . ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు ఉపాధి ఇవ్వడం తో స్థానిక యువత నిరుద్యోగ సమస్యతో మానసికంగా కృంగిపోయి చెడు వ్యసనాలకు బానిసలయ్యే అవకాశం వుంది వీరి భవిష్యత్ ప్రశ్నార్థకం గా మారిపోతుంది . కావున ఇప్పటికైనానియోజకవర్గం లో వున్నా ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థలు స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని. లేనియెడల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల ముందు పలు రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి. స్థానిక యువత కోసం కాంగ్రెస్ పార్టీ. యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలు పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం మైనార్టీ నాయకులు ఎండి షరీఫ్,మండల బీసీ సెల్ నాయకులు సాంబశివరావు, పట్టణ ఉపాధ్యక్షులు ఎండి నూరుద్దీన్ యువజన కాంగ్రెస్ నాయకులు ముక్కెర మధు డి సంతోష్ పల్లపు సంపత్ ఎస్ కె రఫీ పగిడిపల్లి శ్యామ్ ఎండి ఖాన్ చిన్నాల నాగరాజు వెంకటేష్ కాకర్ల సతీష్ దేవా సన్నీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: