✍️ ప్యూన్ బస్తి లో అమ్మవారి మండపాని సందర్శించి, పూజలు చేసి,అన్నదానకార్యక్రమానీ ప్రారంభించిన :ఎమ్మెల్యే వనమా
మున్సిపాలిటీ 5వ వార్డ్ ప్యూన్ బస్తి లో నవరాత్రుల సందర్భంగా అమ్మవారి మండపాన్ని సందర్శించి, పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ అమ్మవారి దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని, ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని తల్లిని ప్రార్థించాను అని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, టి జి బి కే ఎస్ నాయకులు MD. రజాక్, టిఆర్ఎస్ నాయకులు అశోక్, మున్నా, ఈశ్వర, బొమ్మిడి శ్రీకాంత్, కన్ని, బాచి, చిరంజీవి మరియు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: