మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి(అక్టోబర్-31):: ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఐటీసీ) వారి "వాష్" స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అన్నపురెడ్డిపల్లి గ్రామపంచాయతీలో గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి గ్రామంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గ్రామంలో పారిశుధ్యం, మరియు పరిశుభ్రత లక్ష్యంగా, గ్రామ పంచాయతీనీ తీర్చిదిద్ది, ఆదర్శ గ్రామ పంచాయతీగా చేసేందుకు, వాష్ స్వచ్ఛంద సంస్థ అన్నపురెడ్డిపల్లి గ్రామపంచాయతీనీ ఎంపిక చేసుకుందని, స్థానిక సర్పంచ్ బోడ పద్మ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను ఇంటి వద్దే ఎరువుగా మార్చుకునే విధానం గురించి గ్రామస్థులకు అవగాహన చేశారు. ఈ శ్రమదానం కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బోడ పద్మ, వాష్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు జి వెంకటేశ్వర్లు, జి రాంబాబు,(సిసీ),జే జంపరాజు(సివో), గ్రామపంచాయతీ కార్మికులు, గ్రామస్తులు ఉన్నారు.
Post A Comment: