మన్యం టీవీ,అశ్వాపురం :తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ హెల్పేర్స్ కు పెంచిన 30 శాతం పిఆర్సి అమలు చేసి వేతనాలు ఇవ్వాలి అని కోరుతూ రాష్ట్ర మొత్తం జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా బూర్గంపహాడ్ ప్రాజెక్టు పరిది లోని అశ్వాపురం మండల కేంద్రం లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ను ఏ సి డి పి ఓ కు అందించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకురాలు రెడ్డి అరుణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యగులకు ఇచ్చిన విధంగా పిఆర్సి 30 శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చి జీవో ఇచ్చినా జులై నెల నుంచి నేటి వరకు ఇవ్వలేదు అని అన్నారు . దసరా పండుగ సందర్భంగా నూతన వేతనాలు వస్తాయి అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఆడ పడుచులకు నిరాశ పరిచిన కేసీఆర్ తక్షణమే పెరిగిన వేతనాలు అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమం చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాయల భారతి, బొర్రా రజిత, శైలజ, హంసవేణి, పద్మ, నాగమణి, సాహితీ, దీప్తి, మంగతాయారు, కళావతి, తదితరులు పాల్గొన్నారు.
.
Post A Comment: