చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: గ్రామాలలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే తనకు తెలియజేయాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రాకేష్ కుమార్ అన్నారు. తిప్పనపల్లి గ్రామంలో గత కొంత కాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎస్కే రఫీ అనే యువకుడి ఇంటి వద్దకు వెళ్లి సోమవారం ఆయన వైద్య పరీక్షలు నిర్వహించారు. యువకుడి మెడికల్ రిపోర్ట్స్ ను పరిశీలించి, మందులు వాడాలని, అవసరం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలన్నారు. పేద కుటుంబానికి చెందిన ఎస్ కే రఫీ మెడికల్ సమస్యలు తీర్చడానికి అన్ని మందులు, పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇకపై చేయటం జరుగుతుందన్నారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఇమామ్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: