మన్యం మీడియా ప్రతినిధి/దమ్మపేట::గోండు బొబ్బిలి కొమరం భీమ్ 120 వ జయంతి దినోత్సవ వేడుకలను ఆదివాసీ యువ నాయకులు ఆధ్వర్యంలో పార్కలగండి పంచాయతీ లో "కొమరం భీం" చిత్ర పటానికి పుల మాల వేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదివాసి నాయకులు మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జాతి హక్కుల కోసం పోరాడిన భీమ్ ఉద్యమ స్పూర్తితో ఆదివాసీలందరు హక్కుల సాధన కోసం ఉద్యమించాలని అన్నారు.ఈ జయంతి వేడుకల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ కోర్స సాగర్,కారం ప్రసాద్, పీసా కమిటీ అధ్యక్షుడు కారం బాబురావు,పండ భానుచందర్ (పోలిస్ కానిస్టేబుల్) బి భాస్కర్,పి ప్రసాద్,కృష్ణ ఆదివాసీ యువ నాయకులు కాకా శివశంకర్ ప్రసాద్,అరేం ప్రశాంత్, వాడే వీరస్వామి, వాడే ప్రవీణ్ కుమార్, పద్దం అశోక్ కుమార్, కుర్సం కాంతారావు, కారం దుర్గారావు, కారం కృష్ణ రావు, కారం శివరామకృష్ణ, బైటా వినోద్ కుమార్,మరియు గ్రామ పెద్దలు, ఆదివాసీ యువత, విద్యార్థులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: