CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలి:విప్ రేగా

Share it:



మన్యం టివి మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో ప్రభుత్వ విప్,రేగా కాంతారావు పర్యటించారు.ఈ సందర్భంగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యల పై స్థానికుల ఫిర్యాదు మేరకు ప్రధాన రహదారిపై పర్యటిస్తూ,ఎస్ బి ఐ సెంటర్ లోని కట్ట వాగు బ్రిడ్జి, పాత ఆంధ్ర బ్యాంకు వద్ద వట్టి వాగు బ్రిడ్జి ప్రాంతాలను సందర్శించారు.ఆ ప్రాంతాల్లో సమస్యలను స్థానికులు విప్ రేగా దృష్టికి తీసుకురాగా సంబంధిత మున్సిపల్ అధికారులను పిలిపించి మాట్లాడారు.డ్రైనేజీ సమస్యలని వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ ఏ ఈ ని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది,టిఆర్ఎస్ నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: