CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హడలెత్తిస్తున్న మేకల దొంగలు

Share it:

 


 వరుస చోరీల తో మేకలు మాయం

 గుండాల అక్టోబర్ 11 (మన్యం మనుగడ) మండలంలో హడలెత్తిస్తున్న మేకల దొంగలు. వరుస చోరీల తో మందలోని మేకలు మాయం. గత కొద్ది రోజులుగా మండలంలో తరచు మేకలు మాయం కావడంతో వాటి యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మండలం పరిధిలోని రోళ్ల గడ్డ గ్రామానికి చెందిన ఈసం రమస్వామికి చెందిన రెండు మేకలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. శనివారం రాత్రి పడుగోని గూడెం గ్రామానికి చెందిన పెండ్ల కట్ల బుచ్చయ్య కు చెందిన 11 మేకలను దొంగిలించారు. మేకల వ్యాపారస్తుల ముసుగులో ఉదయం రెక్కీ నిర్వహించి రాత్రిపూట ఏం చెక్క వాటిని దొంగిలి స్తున్నారు. ద్విచక్ర వాహనం బొలెరో వాహనాలలో వీటిని తరలిస్తున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టిన గుండాల ఎస్ ఐ సురేష్ దొంగల కోసం వేట ముమ్మరం చేశారు

Share it:

Post A Comment: