మన్యం టీవి, సుజాత నగర్:
సుజాతనగర్ మండలం లోని సర్వారం గ్రామపంచాయతీలో గల ఎం పి పి ఎస్ స్కూల్ నందు మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రత్నాకర్ సార్ గారి ఆధ్వర్యంలో సుజాతనగర్ బిజెపి మండల అధ్యక్షుడు భూక్య రాజేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.
సుమారు 40 మంది విద్యార్థులు గాంధీగారి వేషధారణలో గ్రామ పంచాయతీ లో గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం వరకు శాంతియుత ప్రదర్శనగా వెళ్లి మా పాఠశాలలో మౌలిక సదుపాయాలను మరియు వసతులను కల్పించి మాకు తగినంతమంది ప్రధానోపాధ్యాయులను నియమించ వలసిందిగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఆ రాములోరి కృప ఉండాలని ఆ శ్రీ రామచంద్ర స్వామి వారికి వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది,
అదేవిధంగా గ్రామ పంచాయతీలోని 4/5 తండాలను కలుపుకుంటూ మహాత్మా గాంధీ గారి ప్రదర్శనగా వెళుతూ రఘుపతి రా రాఘవ రాజారాం పతితపావన సీతారాం ఈశ్వర అల్లా తేరే నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్ అంటూ నినాదాలు చేస్తూ పాఠశాలకు విచ్చేసి మహాత్మా గాంధీ గారి పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు,
అనంతరం విద్యార్థిని విద్యార్థులు అందరికీ మిఠాయి చాక్లెట్లు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ ప్రధాన కార్యదర్శి బానోత్ గణేష్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..
Post A Comment: