CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులు వేసిన పత్తి పంటను ధ్వంసం చేసిన అడవి పందులు........

Share it:


చంద్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:
అడవి పందుల వల్ల దాడిలో పత్తి పంటను ధ్వంసం అయిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. బాధిత రైతు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.... మండల పరిధిలోని తిప్పనపల్లి  గ్రామానికి చెందిన ధరావత్ లక్ష్మణ్ తనకు గల రెండు ఎకరాలు మెరక భూమిలో పత్తి పంటను ఈ ఏడాది సాగు చేశాడు. 50 వేల రూపాయలు పెట్టుబడి క్రింద ఖర్చు చేశాడు. పత్తి పంట చేతికందే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున అడవిపందుల పత్తి చేనులో పడి రెండు ఎకరాల పత్తి పంటను ధ్వంసం చేశాయి. ఉదయం చేనుకు వెళ్లిన రైతు దంపతులు ధ్వంసం అయిన పత్తి పంటను చూసి కన్నీరుమున్నీరయ్యారు. తనకు గల రెండు ఎకరాలలో పత్తి పంట సాగు చేస్తే, తీరా చేతికందే సమయంలో అడవి పందులు దాడి చేయడం వల్ల మొత్తం నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంటలో కోల్పోయిన తనకు అధికారులు ఆదుకోవాలని రైతు దంపతులు కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: