మహిళల పై అసభ్య ప్రవర్తన ను ప్రశ్నించినదుకే దాడి
మన్యం టీవి, లక్ష్మిదేవిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
లక్ష్మీదేవిపల్లి మండలం పాలకేంద్రంలో అల్లరి మూకల ఘాతుకానికి పాల్పడ్డారు. మహిళలపై అసభ్య ప్రవర్తన నేపథ్యంలో ప్రశ్నించిన బంధువులపై రౌడీమూకలు విచక్షణా రహితంగా దాడి కి పాల్పడ్డారు.వీరి దాడి లో అనుదీప్ అనే యువకుడు, ఆకృతి అనే 8ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వైద్యం కొరకు కొత్తగూడెం సింగరేణి వైద్యశాలకు తరలించారు.దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మండల వాసూలు డిమాండ్ చెశారు.
Post A Comment: