మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలంలోని అతి ప్రాచీన,చారిత్రక నేపథ్యం కలిగిన మహిమాన్విత మల్లూరుశ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం కు చెందిన హుండీల లెక్కింపు సోమవారం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరకాల పరిశీలకులు అనిల్ కుమార్ ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రవణపు సత్యనారాయణ ల ఆద్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆరు హుండీల లెక్కింపు ద్వారా మొత్తం రూ,3,59,009 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈ.ఓ సత్యనారాయణ తెలిపారు. దేవస్థానం ఆలయ ప్రాంగణంలో అధికారులు, అర్చకులు,సిబ్బంది పాత్రికేయుల సమక్షంలో గర్భగుడి వద్ద ఉన్న రెండు,పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న ఒక హుండీ, దైత అమ్మ వారి వద్ద ఉన్న ఒక హుండీ,వేణుగోపాలస్వామివద్ద ఉన్న ఒక హుండీ,చింతామణి వద్ద ఉన్న ఒకటి మొత్తం నాలుగు చోట్ల ఉన్న ఆరు హుండీల లెక్కింపు పూర్తిస్థాయిలో జరుపగా,ఈ ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు.కాగా జులై 14వతేదీ నుంచి అక్టోబరు 24 వతేదీ వరకు నాలుగు నెలల తర్వాత సదరు హుండీల లెక్కింపు జరిపినట్లు ఈ.ఓపేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ రవికుమార్,నేతాని సీతారాములు,సిబ్బంది శేషుకుమార్ ఆలయ అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు,ముక్కమల రాజశేఖర శర్మ,పవన్ కుమార శర్మ,మురళీకృష్ణ మాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: