CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఖబరస్తాన్ లో పందులను నివారించండి - మైనారిటీ జిల్లా అధ్యక్షుడు యాకూబ్ పాషా.

Share it:

 


పాల్వంచ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మునిసిపల్ పరిధిలోని నటరాజ్ సెంటర్ నందు గల ముస్లింల స్మశాన వాటిక యందు పందులను నిర్మూలించాలని మైనారిటీ జిల్లా అధ్యక్షుడు యాకూబ్ పాషా గురువారం మునిసిపల్ కమీషనర్ శ్రీకాంత్ ను కోరారు. పాల్వంచ పట్టణం లో ముస్లింల స్మశాన వాటిక ఏర్పాటు చేసి 50సంవత్సరాలు గడుస్తుందని, ఇట్టి ఖబరస్తాన్ ( ముస్లిం స్మశాన వాటిక ) లో పూర్వీకుల సమాధులు ఉన్నాయని, ఇట్టి ప్రాంతంలో పందులు సంచరించటంతో పాటు, పందులను పెంచటము , మాంసం కూడా విక్రయించడం జరుగుతుందని, ముస్లింలు పవిత్రంగా భావించే ఖబరస్తాన్ ప్రాంతము , అపవిత్రతకు గురిఅవుతుందని , దీని కారణంగా ముస్లింల మనోభావాలు దెబ్బ తింటున్నాయని కావున ఇట్టి ఖబరస్తాన్ స్థలములో పందుల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ మునిసిపల్ కమీషనర్ తో పాటు జిల్లా కలెక్టర్ , జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు యాకూబ్ పాషా విలేఖరులకు తెలిపారు.

Share it:

Post A Comment: