మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్ల పనితీరును పరిశీలించిన ఎస్పీ
ఈ రోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ మణుగూరు సబ్ డివిజన్ పోలీసు అధికారి కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు ఏఎస్పి శబరీష్ ఐపీఎస్,మణుగూరు సిఐ భానుప్రకాశ్,అశ్వాపురం సిఐ రాజు మరియు మణుగూరు ఎస్సై నరేష్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో 5S సిస్టం అమలులో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా మెలుగుతూ పోలీసులపై నమ్మకాన్ని మరింత పెంచేలా కృషి చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయడం మరియు ఛేదించడం సులభతరం అవుతుందని అన్నారు.నేను సైతం కార్యక్రమంలో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఏఎస్పీ కార్యాలయం ఆవరణలో మొక్కను నాటడం జరిగింది.
Post A Comment: