CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అధికారుల పర్యవేక్షణ లోపం..! ప్రజల ప్రాణాలతో చెలగాటం..

Share it:

 



👉 పెను సమస్యగా మారుతున్న కిడ్నీ వ్యాధి..


👉 డబ్బులు పెట్టి  కొనుకుంటున్న అనారోగ్యం.


మన్యం టీవీ :  జూలూరుపాడు, అక్టోబర్ 4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో ప్రజలు ఎక్కువుగా కిడ్నీ వ్యాధి బారినపడి చనిపోతున్నారు. అనేకమంది కిడ్నీ వ్యాధి సమస్య తో బాధపడుతూ వైద్యశాలలు చుట్టూ తిరుగుతున్నరు. కొందరైతే, డయాలసిస్ తో రోజు బిక్కుబిక్కుమంటూ కాలన్ని నెట్టుకొస్తున్నవారు మరికొందరు ఉన్నారు. ఉదాహరణకు బేతాళ పాడు గ్రామ పంచాయతీలోనీ పంతులు తండా, టాక్యా తండా, చీపురు గూడెం, పడమట నర్సాపురం లో ఈ వ్యాధి బారిన పడి పదుల సంఖ్యలో వ్యక్తులు చనిపోయారు. బతుకు జీవుడా అంటూ మరి కొంతమంది క్షణం క్షణం చస్తూ బతుకు తున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం త్రాగునీరు, ప్రస్తుత పరిస్థితులలో ప్రజలందరు మినరల్ వాటర్ పై ఆధార పడుతున్న నేపథ్యంలో మండల వ్యాప్తంగా వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిపైన పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అవగాహన లేని కొందరు వ్యాపారులు కెమికల్స్ అతిగా వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు నీటి పరీక్షలు నిర్వహించి శుద్ధమైన త్రాగునీరా.. కాదా.. అని నిర్ధారించాల్సిఉంది. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు వారి ఇష్టానుసారంగా కెమికల్స్ కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇది తెలియని ప్రజలు డబ్బులు పెట్టి మరి అనారోగ్యాన్ని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మండలంలో ఈ సమస్య మరింత వ్యాప్తి చందక ముందే  అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి గుర్తింపులేని వాటర్ ప్లాంట్లను సీజ్ చేసి గుర్తింపు పొందిన వాటర్ ప్లాంట్ యజమానులకు సరైన అవగాహన కల్పించి కెమికల్ వాటర్ ను బందు చేయించి, ఫిల్టర్ వాటర్ ను అందించే విధంగా చర్యలు చేపట్టి మండల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Share it:

Post A Comment: