మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 19, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మంగళవారం వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ యదళ్ళపల్లి వీరభద్రం, తెలంగాణ ఉద్యమ నాయకులు వేల్పుల నరసింహారావు, ఎంపీటీసీలు నీల, మధుసూదన్ రావు, సర్పంచులు కిషన్ లాల్, రాందాస్, ముక్తి నరసింహారావు, సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: