👉దళారుల పై చర్య తీసుకోవాలి
👉ఐటీడీఏ పీవో కు వినతి పత్రం అందజేసిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘం
మన్యం టీవి ,దుమ్ముగూడెం : ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో కుసమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం నరసింహారావు, డివిజన్ అధ్యక్షుడు సొందే మల్లు దొర మాట్లాడుతూ దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా జరిగిన ఎస్ టి ట్రైకార్ రుణాల మంజూరు కొరకు ధ్రువపత్రాల పరిశీలన జరిగిందని అందులో అవకతవకలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇదివరకే కొంత మంది వ్యక్తులు ట్రైకార్రుణాలు పొంది ఉన్నారని ఐనప్పటికి రుణాలు మంజూరు చేపిస్తామని దళారులు అమాయక గిరిజనులను మోసం చేస్తున్నారని మండి పడ్డారు. అసలైన గిరిజన ఆదివాసులకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి రుణాలు మంజూరు చేయాలని ఐ టి డి ఓ గారికి వినతి పత్రం అందించారు .ఈ కార్యక్రమంలో లో ,వర్ష సర్వేశ్ కన్నారావు,రాజేంద్ర,గోపాల్,మడకం శేషు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: