👉శోక సముద్రంలో కుటుంబ సభ్యులు
👉 వైద్యుల నిర్లక్ష్యమే కారణమా?
గుండాల ఆళ్లపల్లి అక్టోబర్ 28 (మన్యం మనుగడ) వైద్యుల నిర్లక్ష్యానికి తల్లి భాగ్యలక్ష్మి , శిశువు మృతి చెందారు. ఆళ్లపల్లి మండలం పరిధిలోని మర్కోడు గ్రామానికి చెందిన తాళ్లపల్లి భాగ్యలక్ష్మి మూడవ కాన్పు కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. కాన్పు చేయాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కడుపులోనే మగ శిశువు మృతి చెందగా గత వారం రోజుల నుండి కోమాలో ఉన్న భాగ్యలక్ష్మి చికిత్స పొందుతూ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచింది. భాగ్యలక్ష్మి మృతిచెందడంతో ఇద్దరు చిన్న పాపలు అనాధలయ్యారు. భర్త సంతోష్ కథనం ప్రకారం వైద్యుల నిర్లక్ష్యమే తన భార్య మరణానికి కారణమని ఆవేదన చెందుతున్నారు. పోస్టుమార్టం అనంతరం భాగ్యలక్ష్మి మృతదేహాన్ని మర్కోడు తరలించి కుటుంబ సభ్యుల మధ్య అంతక్రియలు నిర్వహించారు
Post A Comment: