CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. - కొత్తగూడెం మున్సిపల్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

Share it:

 

. భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 2 (మన్యం టీవీ)

భారత దేశ జాతిపిత మహాత్మా గాంధి 152 వ
జయంతిని పురస్కరించుకొని కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల మహాత్మా గాంధి విగ్రహానికి  జిల్లా కలెక్టరు దురిశేట్టి అనుదీప్ పూల మాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి , మునిసిపల్ కమిషనర్ అరిగేల సంపత్ కుమార్ జాతిపిత మహాత్మా గాంధి విగ్రహానికి పూల మాలలు వేయడం జరిగినది. ఈ కార్యక్రమములో కొత్తగూడెం పురపాలక సంఘ గౌరవ వార్డు కౌన్సిలర్లు పల్లపు లక్ష్మణ్, టిఆర్ఎస్ నాయకులు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయములో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఏ.సంపత్ కుమార్ , మరియు మున్సిపల్ కార్యాలయ మేనేజరు యల్.వి. సత్యనారాయణ, మరియు కార్యాలయ సిబ్బంది మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సితాలక్ష్మి మాట్లాడుతూ మాహత్మా గాంధీ 152 వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశముకు చేసిన సేవలను కొనియాడుతూ ప్రస్తుత యువత కూడా గాంధీ సూచించిన మార్గంలో నడిచి భారత దేశ గౌరవం ప్రతిష్టలు పెంచేల కృషి చేయాలని చెప్పడం జరిగినది.

Share it:

TELANGANA

Post A Comment: