గుండాల ఆళ్లపల్లి అక్టోబర్ 2 (మన్యం మనుగడ) రాష్ట్రంలో ఉన్న ఆడపడుచుల ఆనందం చూడడమే ప్రభుత్వ సంకల్పం ఆని ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి అన్నారు. శనివారం బతుకమ్మ పండుగకు ప్రభుత్వం అందించే చీరలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలను పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మహిళలందరూ బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆమెకు కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి కొమరం హనుమంతరావు, తాసిల్దార్ మహమ్మద్ సదియా సుల్తానా, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య , సర్పంచ్ కోటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుపాయం నరసింహారావు, కార్యదర్శి బాబా, నాయకులు ఆదాం, ఖయ్యుం, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: