ప్రతి గ్రామం లోని ప్రాథమిక పాఠశాలలో వ్యాక్సిన్ ఇస్తున్న వైద్య సిబ్బంది
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో ప్రతి గ్రామం లోని ప్రాథమిక పాఠశాలలో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామం నుండి అందరూ వచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని, ఇప్పటికైనా సందేహాన్ని వదిలి స్వతహాగా ముందుకు రావాలని వైద్య రంగం వారు తెలియజేయడం జరిగింది. పినపాక మండలంలోని ఉప్పాక గ్రామంలో ఉదయం 9 గంటల నుండే ప్రజల స్వతహాగా వచ్చి వేయించుకున్నారు. కొన్ని గ్రామాలలో లో స్వతహాగానే 18 సంవత్సరాలు పైబడిన వారందరూ వచ్చి, టీకాలు వేయించుకుంటున్నారు. అన్ని గ్రామాలలో నైతే, ఎన్ని సార్లు చెప్పిన రాకపోవడంతో కొందరు సర్పంచులు గ్రామాలలో కరోనా టీకా వేయించుకోని వారి కుటుంబానికి రేషన్ బియ్యం రాకుండా చేస్తామని అంటున్నారు. ఇలాగైనా అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటారని వారి ఉద్దేశం.
ఈ కార్యక్రమాలలో గ్రామ పంచాయతీల సర్పంచులు, ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: