కరకగూడెం మండల వ్యాప్తంగా 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వినియోగించుకోవాలని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అన్నారు.
గురువారం వట్టంవారి గుంపు,చిరుమల్ల కొవిడ్ కేంద్రాలను ఎంపీపీ రేగా కాళిక పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కరోనా బారిన పడకుండా ఉండాలంటే ధైర్యంగా ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండలఎంపిడిఓ ధారవత్ శ్రీను,స్పెషల్ అఫిసర్ జైసింగ్,స్థానిక సర్పంచ్ పాయం నర్సింహారావు,హెల్త్ ఆసిస్టట్ సున్నం క్రిష్ణ,గొగ్గల నరసింహరావు,ఎఎన్ఎంలు పద్మ,రమ,రైతు నమన్వయ సమితి అధ్యక్షులు వట్టం వెంకటేశ్వర్లు,సేక్రటరీ ప్రశాంత్,ఆశలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: