👉సింగరేణి అధికారులు కి వినతి పత్రం అందజేసిన విప్ రేగా కాంతారావు
మన్యం టీవి, మణుగూరు
మణుగూరు మండలంలోని అనేక సమష్యలను సింగరేణి సంస్థ విధిగా అభివృద్ధి చేయాలని.. ఇప్పటివరకు సింగరేణి చేసింది తక్కువే చేయాల్సింది చాలా ఉంది అని వారికి బాధ్యత యండి ఈ ప్రాంత అభివృద్ధికి భాగస్వాములు కావాలని తెలియజేస్తూ అనేక సమష్యలను వినతిరూపంలో ఈరోజు ప్రభుత్వ విప్ రేగాకాంతారావు గారు మణుగూరు సింగరేణి GM జక్కం రమేష్ గారికి తెలియజేయడం జరిగింది.. దీనిలో భాగంగా మణుగూరు, బుగ్గ ఖమ్మంతోగూ రోడ్డు, అంబేద్కర్ సెంటర్ నుండి బొంబాయి కాలనీ వెళ్లే ప్రధాన రహదారి, బోడెపుడి నగర్ రోడ్డు, PK 1 సెంటర్ నుండి కొండాపురం వెళ్లే రోడ్లను సింగరేణి CSR ఫండ్ కింద వేయవలసిందిగా కోరారు. అలాగే మణుగూరు ZP హై స్కూల్ ను సింగరేణి సంస్థ దత్తత తీసుకొని దానిని అభివృద్ధి చేయాల్సిందిగా కోరారు. మణుగూరు మండలంలోని అన్ని స్కూల్ లకు గ్రావెల్ తొలవలసిందిగా కోరారు. పగిడేరు వద్ద చెక్ డామ్ లను నిర్మించాల్సిందిగా కోరారు. వీటన్నిటికీ సింగరేణి సంస్థ నుండి CSR ఫండ్ వచ్చే విదంగా కృషి చేస్తానని సింగరేణి GM గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ZPTC పొశం నరసింహారావు, TBGKS నాయకులు వుకంటి ప్రభాకర్, సామా శ్రీనివాసరెడ్డి, TRS నాయకులు వట్టం రాంబాబు, యాదగిరి, అప్పారావు, నవీన్, సింగరేణి అధికారులు, తదితరులు పాల్గొన్నారు. :రు.
Post A Comment: