CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వేతన రికవరీ రూపంలో మృతుడైన వేల్పుల.చిన వెంకన్న కుటుంబం పై ఔదార్యం చాటిన ఏరియా కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు

Share it:

                           



మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియా ఓసి 2 నందు గత నెల 18 వ తేదీన జరిగిన ప్రమాద ఘటనలో మరణించిన ఔట్ సోర్సింగ్ కార్మికుడైనా వేల్పుల.చిన వెంకన్న కుటుంబానికి ఆర్ధిక పరంగా అండగా నిలిచి, అక్కున చేర్చుకొవాలని మణుగూరు ఏరియా లోని అన్ని గనుల్లో,డిపార్ట్ మెంట్ లలో విధులు నిర్వహిస్తున్న ప్రతి కార్మికుడు చేయుత అందించాలని,మణుగూరు టిబిజికేయస్ సమావేశాల రూపంలో పిలుపు ను ఇచ్చిన నేపథ్యం దృష్ట్యా ఆ పిలుపును స్వాగతిస్తూ, ఏరియా కార్మికులంతా ఏకతాటిపై ఐక్యత చాటి, ఆగస్టు నెల వేతనం నుంచి ప్రతి కార్మికుడు 200 రూపాయలు వేతన రికవరీ రూపంలో సుమారు రూ. 5,00,000 రూపాయలు మృతుడి కుటుంబానికి అందించడానికి ముందుకు రావడం,అందుకు మిగతా కార్మిక సంఘాల నాయకులు కూడా చేయుత అందించడం పట్ల మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి.ప్రభాకర రావు హృదయ పూర్వక ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలిపారు.ఏరియా కార్మికులంతా మంచి మనసు తో మానవత్వం ప్రదర్శించి,మృతుడి కుటుంబానికి అండగా నిలవడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. టిబిజికేయస్ పిలువులో భాగంగా మృతుడి కుటుంబానికి ఆసరాగా నిలవడం లో తోడ్పాటు అందించిన ఏరియా కార్మికులకు,వారి కుటుంబ సభ్యులకు మరియు ఇతర కార్మిక సంఘాల నాయకులకు మణుగూరు టిబిజికేయస్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

Share it:

Post A Comment: