విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలి ఎంపీటీసీ తాటి పూజిత* అశ్వాపురం మండలం తుమ్మలచేరువు MPTC ఈ రోజు స్కూల్స్ ప్రారంభమైన సందర్భంగా ఆ ప్రాంత స్కూళ్లను సందర్శించి అక్కడి స్కూల్లో ఉపాధ్యాయులకు స్కూల్ విద్యార్థులకు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని తెలియజేసారు మధ్యాహ్న భోజన సమయంలో ఆయాలు భౌతిక దూరం పాటిస్తూ సబ్బుతో గాని శానిటైజర్ తో గాని చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రైమరీ స్కూలు ఉన్నాయని చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని. నమ్మకం, విశ్వాసంతో తల్లిదండ్రులు ప్రభుత్వ బడులకు పిల్లలను పంపిస్తున్నారు. కాబట్టి చిన్నారులకు సరైన రీతిలో బోధిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీటీసీ తాటి పూజిత తెలిపారు.
Post A Comment: