నిత్యవసర వస్తువులు అందజేసిన ఫౌండేషన్ సభ్యులు సత్తు లాల్
గుండాల సెప్టెంబర్ 6 (మన్యం టీవీ) చేతన పౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులను పౌండేషన్ సభ్యులు ఉపాధ్యాయుడు సతులాల్ వలస గిరిజనులకు అందజేశారు. గుండాల మండలం బాటన నగర్( కిష్టాపురం పాడు) వలస ఆదివాసీలకు అదే గ్రామాంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు 40 కుటుంబాలకు 25 వేల రూపాయల నిత్యవసర వస్తువులను అందజేశారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో నిత్యం ఇబ్బందులు పడుతుంటారు. వారి సమస్యను చేతన ఫౌండేషన్ కు వివరించడంతో వారు స్పందించి ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రషీద్, సంపత్ రెడ్డిలు పాల్గొన్నారు
Post A Comment: