గుండాల/ ఆళ్ల పల్లి సెప్టెంబర్ 27 (మన్యం మనుగడ) రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా తలపెట్టిన భారత్ బంద్ అఖిలపక్షం ఆధ్వర్యంలో అఖిలపక్షం విజయవంతంగా ముగిసింది. మండల కేంద్రంలోని దుకాణ సముదాయాల తోపాటు బ్యాంకులు సైతం అఖిలపక్షం ఆధ్వర్యంలో పకడ్బందీగా నాయకులు బందును విజయవంతం చేశారు. సిపిఐ నాయకులు రేసు ఎల్లయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ్ బోయిన సుబ్బారావు , తులం ముత్తి లింగం, న్యూ డెమోక్రసీ నాయకులు బత్తిని సత్యం, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: