👉జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాసరావు.
భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 9 (మన్యం టీవీ) బుధవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపుమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీసీలకు బీసీ బంధు పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి బీసీ కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించరు. అనంతరం వినతి పత్రాన్ని డిఆర్వో అశోక్ చక్రవర్తికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు బండి రాజు గౌడ్ సాంబ సురేందర్ జిల్లా నాయకులు పితాని సత్యనారాయణ కురిమిళ్ళశంకర్, దిడ్డిరామన్, అంజయ్య, రాజేశ్వరి,స్వరూపరాణి, సతీష్ గుoడపునేని, కాటి నాగేశ్వరరావు, గట్ల రమేష్ రాములు, కడలి సాయిబాబా, రవి, వెంకటేశ్వరర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: