మన్యంటీవి, అశ్వరావుపేట: శుక్రవారం వినాయక చవితి సందర్భంగా అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామంలో చింత చెట్టు బజారున జుజ్జురి వెంకన్నబాబు ఆధ్వర్యంలో ప్రస్తుతం బుల్లెట్ బండి సాంగ్ ట్రెండింగ్ అవుతున్న తరుణంలో పిల్లలు చక్కని ఆలోచన తో చింతచెట్టు బజారున ఉన్న చిన్న పిల్లలు మొత్తం బుల్లెట్ బండి పై మట్టి గణపతి విగ్రహాన్ని తయారుచేసి వినాయకునికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా జుజ్జురి వెంకన్నబాబు మాట్లాడుతూ తిరుమలకుంట ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, బోగ బాగ్యాలు, సుఖసంతోషాల తో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు మిడియాకు తెలిపారు.ఈ కార్యక్రమం లో సందీప్, వెంకటసాయి, నాగ శివాజీ, నితిన్, అభి, జస్వంత్, చిన్ను, హర్షిత, దేవకీ, భావన, విక్షితా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: