గుండాల సెప్టెంబర్ 2 (మన్యం టీవీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలో గురువారం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అలాంటి మహా నేత మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యమా చారి, ఈ సం పాపారావు, పెండ్లకట్ల దుర్గ, కొట్టేం శోభన్ బాబు, గడ్డం మోహన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: