CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కమలాపురం బిల్ట్ (రెయాన్స్ )ఫ్యాక్టరీ కార్మికులకు సంఘీభావం తెలిపిన బి ఎస్ పి మంగపేట శాఖ

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


   బహుజన సమాజ్ పార్టీ బి ఎస్ పి పక్షాన మంగపేట మండలంలోని కమలాపురం బిల్ట్ కంపెనీ కార్మికులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకొని వారికి బి ఎస్ పి పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేయడం జరిగింది. బిల్ట్ కంపెనీ యాజమాన్యం వారి ఉద్యోగాలు తొలగించడం వలన  గత 7 సంవత్సరాలుగా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ,కుటుంబాలను పోషించుకోవడానికి పెట్రోల్ బంకులలో,వరి పొలాలల్లో,ఉపాధి హామీ రోజువారి కూలీలుగా మారి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వారికి రావాల్సిన 72 నెలల వేతనాలు రాక,వారికి మంజూరు అయిన బకాయిలు 327 కోట్లు వారికి అందక,వారి పిల్లలను చదివించులోలేక, ఆర్థిక సమస్యలతో 36 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని  ఈసందర్బంగా తెలియజేశారు.బంగారు తెలంగాణా లో ఆకలితో, ఉపాధిలేక, చనిపోతున్నారు. గత ఏడు సంవత్సరాలనుండి అధికార పార్టీకి, ప్రతిపక్షాల పార్టీలకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని తెలియజేశారు.వీరి సమస్యలను బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకు వెళ్లి వారి కష్టాల్లో, కన్నీళ్లలో బి ఎస్ పి వారికి అండగా ఉంటూ నిరంతరం పోరాడుతుందని ఈసందర్బంగా తెలియజేసారు . ఈ కార్యక్రమంలో బి ఎస్ పి మంగపేట మండల అధ్యక్షులు బండి లక్ష్మణ్ ,ప్రధాన కార్యదర్శి మంద సతీష్ ,కమలాపురం గ్రామకమిటి నాయకులు గాజర్ల అశోక్,గాజర్ల తేజ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: