CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోవిందాపురం పాఠశాల విద్యార్థులకు కోవిడ్ లేదు

Share it:

 



పాఠశాల కూడా త్వరలోనే ప్రారంభించండి


మండల విద్యాధికారి గారికి ఆదేశాలు ఇచ్చిన భద్రాద్రి కలెక్టర్

మన్యం మనుగడ, పినపాక: 


పినపాక మండలంలోని గోవిందాపురం పాఠశాల  కరోనా సోకిన విషయం  పాఠకులకు విదితమే. తాజాగా శుక్రవారం నాడు మండల విద్యాధికారి వీరస్వామి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు, ఆయాలకు కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగింది.మొత్తము 25 పరీక్షలు జరపగా అన్ని పరీక్షలు కూడా నెగిటివ్ గా చేయడం జరిగింది. ఈ పరీక్ష ఫలితాల వలన అధికారులు ఒకింత ఉపశమనం పొందారు. అదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పినపాక మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని, పాఠశాలలకు వచ్చే పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఉపాధ్యాయులు కూడా కఠిన నియమాలను పాటించాలని తెలియజేశారు. త్వరలోనే గోవిందపురం పాఠశాల ఉపాధ్యాయుని స్థానంలో వేరొక ఉపాధ్యాయ డిప్యుటేషన్ పై నియమించి, తరగతులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలలో పినపాక మండల తాసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్, పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు ప్రసాద్, మలేరియా సంబంధిత అధికారి అరుణ్ బాబు, ఏఎన్ఎంలు తదితర సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Share it:

Post A Comment: