CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పరిశుద్ధ్య పనులు గాలికొదిలేసిన సర్పంచ్, సెక్రెటరీ!... రోగాలతో ఇబ్బంది పడుతున్న మల్లారం గ్రామపంచాయతీ ప్రజలు

Share it:

 



మన్యం టీవీ పాల్వంచ:-


ఓట్లేసి గెలిపించిన సర్పంచ్ పట్టించుకోవడం లేదు!

పంచాయతీ సెక్రెటరీ వినిపించుకోవడం లేదు!

ఫలితంగా ఆ గ్రామంలో దోమలు ఈగలు పెరిగి విషజ్వరాలు వస్తున్నాయి. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా....

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉమ్మడి ఉల్వనూరు గ్రామపంచాయతీలోని *మల్లారం గ్రామపంచాయతీ* దుస్థితి ఇది!. ఆ గ్రామ ప్రజలు ఊర్లో రోడ్లను శుభ్రం చేయించమని, బ్లీచింగ్ క్రమంగా చల్లించమని, రోడ్లపై ఉన్న గుంతలు లేకుండా చేయమని స్థానిక సర్పంచ్ కు పంచాయతీ సెక్రెటరీకి ఎన్నోసార్లు మోర పెట్టుకున్నప్పటికీ ఇదిగో ఈరోజు చేస్తాం అదిగో ఆ రోజు చేస్తాం అంటూ కాలం వెళ్లబుచ్చారు. ఫలితంగా గ్రామంలో దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు ప్రబలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ... మా గ్రామంలో మట్టి రోడ్డు గుంతలను మరమ్మతులు చేయించాలని మరియు పారిశుద్ధ్య పనులు చేపించాలి అని, దోమలు లేకుండా చూడాలని, అనేకమార్లు సర్పంచ్, సెక్రెటరీ కి చెప్పినా వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి అయినా ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేపించిరోగాలు రాకుండా మా గ్రామాన్ని కాపాడాలని అధికారులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పాయం రఘుబాబు, బడేటి కోటయ్య, బొబ్బల శ్రీకాంత్,పడిగా రాజేష్, వర్ష పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: