మన్యం టీవీ మణుగూరు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం,కూనవరం గ్రామం లో టిఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని.బాబు రావు అధ్యక్షతన,గ్రామ శాఖ అధ్యక్షులు బత్తుల. నాగేశ్వరరావు,జెండా ను ఎగర వేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మణుగూరు సొసైటీ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు హాజరైనారు. వారు మాట్లాడుతూ ఢిల్లీ కేంద్రంలో తెలంగాణ భవన్ భూమి పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ జరుపుకోవడం జరిగింది అని,టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని అని కొనియాడారు.ఇట్టి కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏనిక ప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీటీసీ సంఘం ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,స్థానిక ఎంపీటీసీ,తాటి సరిత,వార్డ్ మెంబర్స్ ఏనిక సమ్మయ్య, ఏలిబోయిన సురేష్,ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఎండి. హబీబ్,ఉద్యమ నాయకులు ఎండి మూస,ఎండి గౌస్ పాషా,సీనియర్ నాయకులు ఎండి వాహిద్,పార్టీ యువజన నాయకులు, గ్రామ పెద్దలు రామారావు, వెంకటేశ్వర్లు,రాంబాబు,లక్ష్మయ్య,ముసలయ్య మహిళా నాయకురాలు ఏనిక. రమణ,వసంత,లక్ష్మి,సకిని వాణి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: