*ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక జడ్పిటిసి ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ములుగు జిల్లా ఇంచార్జ్ కుసుమ జగదీష్.
మన్యం టీవీ ఏటూరు నాగారం
తెరాస అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల జయశంకర్ సార్ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జెండా పండుగ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక జడ్పి టి సి ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసమ జగదీష్ హాజరై జయశంకర్ సార్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ పార్టీ రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వం గల అతి పెద్ద పార్టీగా ఆవిష్కృతం అయిందని అన్నారు.ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ భవన శంకుస్థాపన చేయడం తెలంగాణ పార్టీకి చాలా శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యురాలు వలియబీ సలీం,ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,పిఎసిఎస్ చైర్మన్,డైరెక్టర్లు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మండల ప్రధాన కార్యదర్శులు మండల ఉపాధ్యక్షులు మండల మహిళా అధ్యక్షులు ఉపాధ్యక్షులు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్స్ టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: