CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

"దళిత బంధు" రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోక ...

Share it:




మన్యం టీవీ :  జూలూరుపాడు, సెప్టెంబర్ 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో "దళిత బంధు" ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటూ రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు యాసా కొండలరావు మాట్లాడుతూ.. కెసిఆర్ నూతనంగా ప్రవేశపెట్టిన దళిత బందును రాష్ట్రమంతటా అమలు చేయాలని, హుజురాబాద్ నియోజకవర్గంలో ఇస్తే రాష్ట్రమంతటా ఇచ్చినట్లు కాదని, దళితులు తెలంగాణా రాష్ట్రం అంతటా ఉన్నారని, అన్నారు. దళిత బంధు పథకం కొన్ని మండలాలకు కేటాయించి కొంతమందికే ఇచ్చి కెసిఆర్ దళితులను మరోసారి మోసం చేస్తున్నారని అన్నారు. జూలూరుపాడు మండలంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు ధర్మా మాట్లాడుతూ.. కెసిఆర్ దళిత బంధు హుజురాబాద్ వరకే పరిమితం చేసి ఎన్నికల పబ్బం గడుపుతారని, అన్నారు. స్థానిక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అమలు చేయాలని, ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, లేనియెడల దళితులకు మద్దతుగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే సొంత మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని, నీళ్ళ, రోడ్లు, డ్రైనేజీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు యాస కొండలరావు, గార్లపాటి వెంకటి, బానోతు ఇస్రా, ఊడల వెంకటేశ్వర్లు, లకావత్ శ్రీను, పెరుమాల్ల శ్రీను, వల్లమల్ల దానయ్య, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు గార్లపాటి పవన్, కార్యదర్శి బొడ అభిమిత్ర, దళితులు వెంకటి,విజయ్, చందర్, దేవయ్యా, వజ్రమ్మ, జానకి, తిరుమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: