మన్యంటీవి, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం లో పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పలు రకాల సేవ కార్యక్రమాలు నిర్వహించి నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటు తన సొంత ఖర్చులతో తన అభిమాన రాజకీయ నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వున్న అభిమానంతో తన దగ్గరకు వచ్చి సహాయం కోరేవారికి ఆర్థిక సహాయాలు అందించటం ఎవ్వరి దగ్గర ఏమీ ఆశించకుండా అన్ని తానే నిరుపేద కుటుంబాలకు కడుపు నింపుతున్న అన్నదాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమాని జక్కుల రాంబాబు. జక్కుల చేస్తున్న సేవలు గుర్తించి, నిరంతరం ప్రజా సేవలో దూసుకుపోతున్న నేపథ్యంలో అశ్వారావుపేట అంబెడ్కర్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక అశ్వారావుపేట శ్రీ సత్య సాయి బాబా కళ్యాణ మండపంలో జక్కుల రాంబాబుకు ఘనంగా శాలువాతో సన్మానించారు, ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా దిశ అధ్యక్షురాలు వేముల భారతి (అశ్వారావుపేట ఎంపీటీసీ 1) ఉట్లపల్లి సర్పంచ్ సాధు జోస్నా బాయ్ మరియు యూత్ సభ్యులు కె మంగరాజు, జగదీష్, శ్రీకాంత్, శరత్, రాజేష్, మహేష్, వెంకన్న బాబు, సందీప్, వెంకీ
మంగరాజు కృపాకర్, చరణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: