మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియాలోని జెకె5 ఓసి ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఓసి బొగ్గు తీసిన ప్రాంతంలోని బొంద గనుల్లో గత కొన్ని రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని నిర్వాసిత కాలనీకి చెందిన కొంతమంది యువకులు ఓసి ఏరియాలో చిరుత పులి సంచరిస్తున్నట్లు గా గ్రహించి తమ సెల్ ఫోన్ ల ద్వారా ఫోటోలు లు తీయడం తో చిరుత సంచారం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం వెల్లడి కావడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అసలు నిజంగా చిరుత సంచారం చేస్తోందా. .? లేక పుకార్ల అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు నిజం తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
Post A Comment: