CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

షాదీఖానాల ఆక్రమణలపై విచారణ నిర్వహించండి _ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎం.డి యాకూబ్ పాషా

Share it:

 



జిల్లాలో ఆక్రమణలకు గురిఅవుతున్న ముస్లిం షాదీఖానాల పై విచారణ చేపట్టాలని కోరుతూ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎం.డి యాకూబ్ పాషా, గురువారం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సంజీవ్ రావుకు వినతిపత్రంసమర్పించారు. కొత్తగూడెం పట్టణం లోని " ప్యూన్ బస్తి " నందు గల ముస్లింలకు చెందిన షాదీఖానా స్థలాన్ని కొందరు ఆక్రమించుకోవడం జరిగిందని, అదే విధంగా భద్రాచలంలో గల షాదీఖానా స్ధలాన్ని కూడా కొంతమంది ఆక్రమించుకుపోవడం తో , అక్కడి ముస్లింలు దానిని అడ్డు కోవటం జరిగిందని,ఇట్టి షాదీఖానాల స్థలాలను పూర్తి స్థాయి లో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా కొత్తగూడెం పట్టణం లో గల " ప్యూన్ బస్తి " షాదీఖానా మరమత్తులు కోసం 2017లో 11లక్షల రూపాయిలు నిధులను కేటాయించి అందులో కొత్తగూడెం మున్సిపాలిటీ ద్వారా అక్షరాలా 2,23,105 రూపాయలతో పాక్షికంగా మరమ్మతులు చేపట్టినారని, మిగిలి ఉన్న 8,76,895 రూపాయిలు కలెక్టర్ ఖాతాలో ఉన్నాయని, ఈ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించాలని కోరారు. అదే విధంగా శిధిలావస్థలో ఉన్న దమ్మపేట, అశ్వారావుపేట, భద్రాచలం లో గల షాదీఖానాలకు నిధులు కేటాయించి వాటిని ఆయా ప్రాంత ముస్లింలకు ఉపయోగా పడే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఎం.డి యాకూబ్ పాషా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ నాయకులు హుస్సేన్ ఖాన్ , షకీల్ , అసిఫ్ , ఇర్ఫాన్ ఖాన్ , తదితరులు పాల్గొన్నారు. 


ఫోటో :-

జిల్లా మైనారిటీ అధికారికి వినతి పత్రం అందిస్తున్న యాకూబ్ పాషా .

Share it:

Post A Comment: