మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో బుధవారం నుండి తరగతులు ప్రారంభించడం జరిగిందని మోహన్ రావు పేర్కొన్నారు. ఏరియా జియం మల్లెల సుబ్బారావు ఆదేశాల మేరకు కరస్పాండెంట్ జిఎం పర్సనల్ వి మోహన్ రావు పాఠశాలను సందర్శించి ప్రారంభానికి సంబంధించి నిబంధనలు పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట కోవిడ్-19 జాగ్రత్తలపై పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు తిప్పర్తి వెంకటేశ్వర్లుతో కలిసి తరగతి గదులు పరిసరాలను పరిశీలించి విద్యార్థులు తరగతి గదులు సామాజిక దూరం పాటిస్తూ బెంచికి ఒక్కరు చొప్పున కూర్చునే విధంగా ఏర్పాటు చేయాలని అని సూచించారు. మొదటి రోజే 467 మందికి విద్యార్థులకు 60 మంది ప్రైమరీ స్కూల్లో 229 మంది గాను 20 మంది హాజరయ్యారని తెలిపారు.
Post A Comment: